తెలంగాణ భీమ్ ఆర్మీ అధ్యక్షుడి ‌పై దుండగుల దాడి.. ?

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ చౌరస్తాలో తెలంగాణ భీమ్ ఆర్మీ అధ్యక్షుడు సుజిత్ రావణ్‌పై గత అర్ధరాత్రి దాటిన తర్వాత దాడి జరిగింది.బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుజిత్ ‌పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేశారని సమాచారం.

 Attack On Telangana Bhim Army President, Telangana, Bhim Army Chief, Sujith, Att-TeluguStop.com

ఆ సమయంలో తన బైక్‌పై సుజిత్ బంజారాహిల్స్‌లో ఉన్న అతని ఇంటికి వెళ్తుండగా ఖైరతాబాద్ చౌరస్తాలో స్కార్పియో వాహనంలో వచ్చిన దుండగులు ఆయనపై కత్తులతో దాడి చేశారట.ఈమేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, వెంటనే సుజిత్‌ను సమీపంలోని ఓ ప్రైవేట్‌ దవాఖానకు తరలించారట.

ఇక ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఈ క్రమంలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారట.

ఇకపోతే సుజిత్ రావణ్‌ పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube