సాధారణంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ముంబైలో సొంత ఇంటిని కొనుగోలు చేయాలన్న కల అందరికీ ఉంటుంది.ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్లు ముంబైలోని ఎక్కువగా జుహు ప్రాంతంలో ఇంటిని కొనుగోలు చేస్తుంటారు.
ఇప్పటికే ఎంతో మంది స్టార్ సెలబ్రిటీలు ఈ ఏరియాలో కోట్లలో ఖర్చు చేసి ఇంటిని కొనుగోలు చేశారు.తాజాగా మరొక బాలీవుడ్ బ్యూటీ ముంబైలోని జుహు ప్రాంతంలో ఇంటిని కొనుగోలు చేసి ఈ దీపావళికి తనకు తానే సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చుకుంది.
మరి ఆ సెలబ్రిటీ ఎవరు అనే విషయానికి వస్తే…
‘దంగల్’ ద్వారా అందరినీ సందడి చేసిన సన్యా మల్హోత్రా ఈ దివాళీని ఎప్పటికీ మరిచిపోని విధంగా సెలెబ్రేట్ చేసుకుంది.అందుకు గల కారణం ఈ బ్యూటీ ముంబైలోని కొత్త ఇంటిని కొనుగోలు చేయడమే.
ఇది జుహూ-వెర్సోవా లింక్ రోడ్లోని బేవ్యూ బిల్డింగ్లో ఉండగా.తనకు తానే స్పెషల్ గిఫ్ట్ ప్రజెంట్ చేసుకుని మురిసిపోతోంది.సన్యా ఆమె తండ్రి కలిసి రూ.14.3 కోట్లకు ఇంటిని కొనుగోలు చేశారు.అయితే గత నెల 14వ తేదీ ఈ ఇంటిని మొత్తం తన పేరుపై మార్చుకున్నట్లు తెలుస్తోంది.
ఇలా ఈమె కొనుగోలు చేసిన ఇంటికి పక్కనే రాక్ స్టార్ క్రిష్ మూవీ సిరీస్ తో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న హృతిక్ రోషన్ ఇల్లు ఉండటం గమనార్హం.బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సైతం ఇదే బిల్డింగులో గత ఏడాది 100 కోట్లు పెట్టి రెండు ఇళ్లను కొనుగోలు చేశారు.ఈమేరకు సన్యా ప్రస్తుతం హృతిక్ రోషన్ పొరుగింటి అమ్మాయిగా మారిపోయింది.
అయితే గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సన్యా మల్హోత్రా మాట్లాడుతూ ముంబైలో ఇల్లు కొనుగోలు చేయడం తన కల అని తెలియజేశారు.ముంబై ఎంతో సురక్షితమైన ప్రదేశమని తనకు శాంతితో పాటు స్వేచ్ఛను కూడా ఇస్తుందని గతంలో ఈమె వెల్లడించారు.