యాదగిరిగుట్ట పట్టణంలో ఉచిత క్యాన్సర్ శిబిరం...!

యాదాద్రి భువనగిరి జిల్లా:రోటరీ క్లబ్ ఆఫ్ యాదగిరిగుట్ట మరియు భువనగిరి సెంట్రల్ వారి ఆధ్వర్యంలో గురువారం యాదగిరిగుట్ట పట్టణంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని( Cancer camp ) ఏర్పాటు చేశారు.రోటరీ క్లబ్ గవర్నర్ , తాళ్ల రాజశేఖర్ రెడ్డి,యాదాద్రి ఆలయ ఈఓ జి.

 Free Cancer Camp In Yadagirigutta Town...!-TeluguStop.com

గీతారెడ్డితో కలిసిఈ శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా రోటరీ క్లబ్ గవర్నర్ తాళ్ల రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మొదటి స్టేజీలోనే క్యాన్సర్ ను గుర్తిస్తే తగ్గే అవకాశం ఉందన్నారు.

అలాగే యాదాద్రి ఆలయ ఈఓ గీతారెడ్డి ( EO Geetha Reddy )మాట్లాడుతూ పన్నెండు వేలు విలువచేసే క్యాన్సర్ టెస్టును ఉచితంగా అందజేయడం సంతోషకరమని అన్నారు.ఉచిత శిబిరానికి హాజరైన100 మందికి పరీక్షలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భువనగిరి సెంట్రల్ అధ్యక్షులు సద్ది వెంకట్ రెడ్డి,యాదగిరిగుట్ట క్లబ్( Yadagirigutta Club ) అధ్యక్షులు దీకొండ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube