రేపు వందే భారత్ రైలు ప్రారంభం..: కిషన్ రెడ్డి

వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ను రేపు ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు.సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య ఈ రైలు నడవనుంది.

 Vande Bharat Train Will Start Tomorrow..: Kishan Reddy-TeluguStop.com

గంటలకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైలు సంక్రాంతి సందర్భంగా రేపటి నుంచి అందుబాటులోకి రానుంది.

ఈ క్రమంలో రేపు ఉదయం 9 గంటలకు రైలు ప్రారంభం అవుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకారం అందరికీ ఆహ్వానాలు పంపామన్నారే.వందే భారత్ రైలు ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ వస్తారని ఆశిస్తున్నామని చెప్పారు.

దేశంలో ఇది ఆరవ వందే భారత్ రైలని తెలిపారు.అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ కింద దేశ వ్యాప్తంగా లక్షా 50 వేల బస్తీ దవాఖానాలు నిర్మించామని ఆయన వెల్లడించారు.అంతేకాకుండా ప్రతి నెలా లక్ష వరకు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని పేర్కొన్నారు.10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడమే లక్ష్యమన్న కిషన్ రెడ్డి ఇప్పటికే రెండు దఫాలుగా ఉద్యోగాలను భర్తీ చేశామని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube