తెలుగు సినీ ప్రేక్షకులకు జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీబిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం అనసూయ చేతిలో బోలెడు ప్రాజెక్టులు ఉన్న విషయం తెలిసిందే.మొన్నటి వరకు యాంకర్ గా సత్తాను చాటిన అనసూయ ప్రస్తుతం నటిగా కూడా సత్తాను నిరూపించుకుంటోంది.
కాగా అనసూయ కు వెండితెర పై అవకాశాలు ఎక్కువ అవ్వడంతో యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేసిన విషయం తెలిసిందే.కాగా ఇప్పటికే అనసూయ ఇప్పటికే పుష్ప, రంగస్థలం లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఈ రెండు సినిమాలు కూడా ఆమెకు మరిన్ని అవకాశాలను తెచ్చిపెట్టాయి.కాగా అనసూయ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతూనే మరొకవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.
తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.అలాగే ఎక్కడికి వెళ్లినా కూడా అందుకు సంబందించిన ఫొటోస్, వీడియోస్ ని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా అనసూయ శ్రీకాళహస్తిని సందర్శించి ప్రత్యేకంగా పూజలు కూడా నిర్వహించింది.అందుకు సంబంధించిన ఫోటోలను కూడా తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకుంది.
అయితే ఆ ఫోటోని చూసి కొందరు అనసూయ పై పాజిటివ్ కామెంట్స్ చేస్తుండగా మరికొందరు అనసూయని ప్రశ్నిస్తున్నారు.ఈ క్రమంలోనే ఒక నెటిజన్ అనసూయ ఫోటోపై స్పందిస్తూ.రాహు కేతువు పూజ చేయించారా అయితే గాడ్ బ్లెస్ యు.కానీ మిమ్మల్ని అంతలా అభిమానించే వారికి మీరు ఒక రిప్లై కూడా ఇవ్వరు.అదే బ్యాడ్ కామెంట్ చేసినా బ్యాడ్ కంటెంట్ కి మాత్రం రిప్లై ఇస్తారు అంటూ కామెంట్ చేసాడు.కొందరు మాత్రం అనసూయపై ఇలాగే మంచి మంచి స్థాయిలకు ఎదగాలి మీ ఫ్యామిలీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము అంటూ కామెంట్స్ చేస్తున్నారు.