దేశభక్తి కార్యక్రమాలను సైతం రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునేంతగా వైఎస్సార్సీపీ దిగజారిపోతోందని తెలుగుదేశం పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తమ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్పై కఠిన చర్యలు తీసుకోకుండా వైఎస్సార్సీపీ టీడీపీపై బురదజల్లుతుందని టీడీపీ నేతలు అంటున్నారు.
ఆజాదీ కా అమత్ మహోత్సవంపై చర్చించేందుకు కేంద్రం నుంచి ఆహ్వానం మేరకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వచ్చినప్పుడు ఆయన ఢిల్లీ పర్యటనకు వైఎస్సార్సీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు.క్రిమినల్ కేసుల మాఫీ కోసం వైఎస్ఆర్సీపీ నేతల మాదిరిగా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లలేదని నేతలు స్పష్టం చేశారు.
కడప ఉక్కు ఫ్యాక్టరీని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ను తాకట్టు పెట్టిన చరిత్ర వైఎస్సార్సీపీ నేతలకు ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు.వైఎస్ఆర్సీపీని ప్రజలు తరిమికొట్టే రోజు ఎంతో దూరంలో లేదని, దేశభక్తి కార్యక్రమాలను సైతం రాజకీయ లబ్ధి కోసం వినియోగించుకోవడం అధికార పార్టీ నేతలకు అలవాటేనని టీడీపీ నేతల అంటున్నారు.

గత మూడేళ్లుగా ప్రతినెలా లక్షల రూపాయల జీతం డ్రా చేస్తూ ఖజానాను కొల్లగొట్టడం తప్ప. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వానికి ఎలాంటి నిర్మాణాత్మక సలహా ఇచ్చారని టీడీపీ నేతలు ప్రశ్నించారు.సజ్జల రాజ్యాంగానికి అతీతంగా ప్రవర్తిస్తున్నారని, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును విమర్శించే హక్కు ఆయనకు ఏముందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ధ్వజమెత్తారు.2024లో మళ్లీ అధికారంలోకి వస్తామని వైఎస్ఆర్సీపీ నేతలు పగటి కలలు కంటున్నారని, అది కలగానే మిగిలిపోతుందని అచ్చెన్ననాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం గడప గడపకూ కార్యక్రమాన్ని ప్రారంభించగానే ప్రజలు తమపై తిరుగుబాటు చేయడంతో అధికార పార్టీ పతనం ప్రారంభమైందన్నారు.ప్రజల సమస్యల పరిష్కారానికి ఫిరాయింపు రాజకీయాలు పరిష్కారం కాదని అధికార పార్టీ నేతలు గుర్తుంచుకోవాలని అచ్చెన్నాయుడు అన్నారు.