టాలీవుడ్ నటుడు, హీరో మోహన్ బాబు కుమార్తె నటి మంచు లక్ష్మి గురించి మన అందరికి తెలిసిందే.మోహన్ బాబు కూతురు గా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మంచులక్ష్మి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది.
ఇక మంచు లక్ష్మి పై సోషల్ మీడియాలో ఏవిధంగా ట్రోలింగ్స్ జరుగుతూ ఉంటాయో మనందరికి తెలిసిందే.ఆమె మాట్లాడే తెలుగులో తప్పులను వెతుకుతూ ఆమె పై నెటిజన్స్ ట్రోలింగ్స్ చేస్తూ ఉంటారు.
మంచు లక్ష్మి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.
అదే విధంగా తన వ్యక్తిగత విషయాలను, మంచు ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
అప్పుడప్పుడు తన కూతురుతో కలిసి చేసే అల్లరి కి సంబంధించిన వీడియోలు, ఫొటోలను కూడా పంచుకుంటూ ఉంటుంది.ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అప్పుడప్పుడు పలు రకాల సమస్యల గురించి ట్వీట్ చేస్తూ ఉంటుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేసింది.అందుకు సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ప్రస్తుత కాలంలో ఒక సినిమాకు నిర్మాతగా వ్యవహరించడం ఎంత కష్టం అన్నది ఆ ట్వీట్ లో పేర్కొంది మంచు లక్ష్మి.
అయితే ఇప్పట్లో నిర్మాతలను కేవలం ఫైనాన్షియర్ లుగానే చూస్తున్నారని, సినిమా నిర్మాణ ఈ విషయంలో వారి పాత్ర కనుమరుగవుతోంది అని తెలిపింది.మంచు లక్ష్మి చేసిన ట్వీట్ ప్రస్తుతం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది చాలా ఇరిటేట్గా ఉంది.నిర్మాతల కష్టాలు.
యాక్టర్స్ లైఫ్ సో బెటర్ అంటూ హ్యాష్ ట్యాగ్లతో ట్వీట్ వేసింది.ప్రతీ రోజూ సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి.
వాటిని ఎదుర్కొని నిలబడాలి.ఓ సినిమాను నిర్మించాలంటే ఎంతో నైపుణ్యం ఉండాలి.
అందరినీ మ్యానేజ్ చేయాలి.సమర్థవంతంగా ఉండాలి.
నిర్లక్ష్యం, ఈగోలు, యాటిట్యూడ్ వంటివి ఎక్కువగా ఉంటాయి.అప్పటి నుంచి ఒక్క షాట్ కోసం ఎదురుచూస్తున్నా.
చాలా ఇరిటేట్ అవుతోంది.నిర్మాతల కష్టాలు.
యాక్టర్స్ బతుకే సో బెటర్ అని ట్వీట్ వేసింది మంచు లక్ష్మి.ఈ ట్వీట్ పై మంచు అభిమానులు ఆమెను ప్రశంసిస్తున్నారు.