యాదాద్రి జిల్లా:యాదగిరిగుట్టలో శుక్రవారం సాయంత్రం ఘోరం జరిగింది.పురాతన రెండస్థుల భవనం ఫోర్ట్ కో ఒక్కసారిగా కుప్పకూలడంతో నలుగురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు.
ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు గుండ్లపల్లి దశరథ(80),సుంచు శ్రీను(40),అంగటి ఉపేందర్ (45),శ్రీను(45)లుగా గుర్తించారు.ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గిరి అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో భువనగిరి ఆసుపత్రికి తరలించారు.
ఘటనా స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు.మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది