ప్రముఖ టాలీవుడ్ సింగర్ సునీత తనదైన శైలిలో పాటలు పాడి ప్రేక్షకులను అలరించి, నవ్వించి ప్రేక్షకుల మనసులలో చోటు సంపాదించుకుంది.తను సినిమాలలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పని చేసింది.
కానీ సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఈమె టాలీవుడ్ లో అత్యంత పాపులర్ సింగర్ లలో ఒకరు.
తన జీవితంలో రెండవ వివాహం చేసుకుని విమర్శలను కూడా ధైర్యంగా ఎదుర్కొంది.
పెళ్లి సమయంలో ఈమె చాలా రోజుల పాటు వార్తల్లో నిలిచింది.
లేటు వయసులో వివాహం చేసుకుంది అని వార్తల్లో నిలిచినా ఈమెను ఎక్కువ మంది సపోర్ట్ చేసిన వారే ఉన్నారు.ఈమెకు టాలీవుడ్ ప్రముఖ వ్యాపారవేత్త రామ్ వీరపనేని తో వివాహం జరిగింది.
ఎంతో కాలం ఒంటరిగా గడిపిన తరువాత సింగర్ సునీత తీసుకున్నా ఈ నిర్ణయంపై ఆమె అభిమానులు అభినందించారు.
పెళ్లి తర్వాత చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతున్న కూడా కొంత మంది సునీత పై ఇంకా పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.
ఆమె కూడా అలాంటి కామెంట్స్ వచ్చినప్పుడు భయపడ కుండా తనదైన శైలిలో కౌంటర్ వేస్తూ అందరి నోళ్లు మూయిస్తుంది.
తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా ఒక నెటిజెన్ ఆమె భర్తను దారుణంగా అవమానిస్తూ కామెంట్ చేసాడు.అందుకు సునీత కూడా అదిరిపోయే రిప్లై ఇచ్చింది.
సునీత, రామ్ వీరపనేని రామానుజులు విగ్రహాన్ని సందర్శించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు.
స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటూ సునీత ఈ పిక్స్ ను అభిమానులతో పంచుకుంది.అయితే ఈ పిక్ చూసిన నెటిజెన్ మాత్రం కాకి ముక్కుకి దొండ పండు సునీతకు ముసలి రామ్ మొగుడు.
అందం ఆమె సొంతం, ధనము ఆయన సొంతం, గానం ఈవిడది దర్జా అతనిది.అంటూ కామెంట్ చేసాడు.
ఈ కామెంట్ చూసిన సునీత అతడి స్టైల్ లోనే రిప్లై ఇచ్చింది.‘నోటి దూల నీది.నీ భారం భూమిది.అంటూ సునీత రిప్లై ఇచ్చింది.ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.