ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రభాస్ రేంజ్ ఎంతగా ఉందో అందరికీ తెలిసిందే.పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్న ప్రభాస్ బాలీవుడ్ హీరోల కంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నాడు.
బాహుబలి తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలకే దారి పడుతూ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.ప్రస్తుతం ఆయన ఖాతాలో వరుస సినిమాలు ఉన్నాయి.
అందులో సలార్, రాధేశ్యామ్, ఆది పురుష్ సినిమాలు ఉన్నాయి.ఇదిలా ఉంటే రాధేశ్యామ్ త్వరలో విడుదల కానున్న సందర్భంగా తాజాగా ఫస్ట్ రివ్యూ కూడా వచ్చేసింది.రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతుంది.ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.
కృష్ణం రాజు సమర్పణలో యువి క్రియేషన్స్, టి సిరీస్ నిర్మాణంలో, గోపీకృష్ణ మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీదలు ఈ సినిమాలను నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్, సాంగ్స్, ట్రైలర్ విడుదల కాగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
రోమాంటిక్ పీరియాడికల్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది.
పునర్జన్మ నేపథ్యంలో సరికొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాకు భారీ అంచనాలే తోడవుతున్నాయి.ఇదిలా ఉంటే ఈ సినిమాను ఈనెల 14న విడుదల చేస్తామని గతంలో ప్రకటించారు.
ఈ సందర్భంగా ఈ సినిమాను సెన్సార్ బోర్డు అధ్యక్షుడు ఉమైర్ సంధు వీక్షించగా ఈ సినిమా రివ్యూను తన ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు.
రాధేశ్యామ్ సినిమా ట్రైలర్ కంటే ఎంతో బాగుందని అన్నాడు.
నిజానికి ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పుడు అందులో విజువల్స్ ప్రేక్షకులను ఎవరి ఊహలకు అందుకొని విధంగా బాగా ఆకట్టుకున్నాయి.దీంతో ఉమైర్ చేసిన ట్వీట్ తో ప్రేక్షకులలో ఈ సినిమా చూడాలని మరింత ఆతృత పెరిగింది.
మరి ఈ సినిమా ఎటువంటి అడ్డంకులు లేకుండా ఈనెల 14న విడుదల అయితే మాత్రం ప్రేక్షకులకు పండగనే చెప్పవచ్చు.
ప్రస్తుతం దేశంలో వైరస్ కారణంగా ఇప్పటికే పలుచోట్ల థియేటర్లు కూడా మూసి వేశారు.
ఈ నేపథ్యంలో రాజమౌళి కూడా తన సినిమాను వాయిదా వేశాడు.అదే సమయంలో ప్రభాస్ సినిమా రాధేశ్యామ్ ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమా కూడా వాయిదా పడుతుందని అనుకుంటున్నారు.
ఈ సినిమా విడుదలయ్యే వరకు కూడా ఈ సినిమా విడుదల గురించి గ్యారెంటీగా చెప్పలేకపోతున్నారు.
ఇక ప్రభాస్ వీటితో పాటు సలార్, ఆది పురుష్ సినిమాల్లో కూడా బిజీగా ఉండగా ఈ సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.ప్రస్తుతం ఈ సినిమాలు షూటింగ్ బిజీ లో ఉండగా ఈ సినిమాలు కూడా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక వీటితో పాటు ప్రభాస్ ఇటీవలే మరో సినిమాకు కూడా సైన్ చేసాడని వార్తలు వినిపిస్తున్నాయి.