ప్రమాదం ఎప్పుడు ఎటు నుంచి వస్తుందో చెప్పడం ఎవరి తరం కాదు.దాన్ని ఊహించడం కూడా అసాధ్యమే అవుతుంది.
అయితే ఈ నడుమ కలికాలంలో ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం.నడి రోడ్డు మీద కత్తులతో దాడి చేసి చంపేసినా పట్టించుకునే నాథులు లేకుండా పోతున్నాడు.
ఎవరూ కూడా అడ్డుకునేందుకు ప్రయత్నించడం లేదు.వేలాది మంది చూస్తుండగా మర్డర్లు చేస్తున్నా కూడా ఎవరిలోనూ చలనం లేకుండా పోతోంది.
దీన్ని ఆధారంగా చేసుకునే దుర్మార్గులు చెలరేగిపోతున్నారు.
ఇప్పుడు కూడా జపాన్ దేశంలోని మెట్రో ట్రెయిన్ లో ఇలాంటి దారుణమే జరిగింది.
జపాన్ అంటేనే ఎంత డెవలప్ చెందిన దేశమో మనందరికీ తెలిసిందే.ఇక్కడి మెట్రో ట్రెయిన్లు ప్రపంచంలోనే అత్యంత వేగాన్ని కలిగి ఉన్న వాటిగా ఆ దేశానికి గుర్తింపు ఉంది.
అయితే ఇదే క్రమంలో ఆ దేశంలోని రైల్వే స్టేషఫన్లలో అప్పుడప్పుడు జరుగుతున్న ఘోరాలు కూడ ఆశ్చర్యపరుస్తుంటాయి.ఇప్పుడు కూడా ఆ దేశంలోని మెట్రో స్టేషన్ లోకి సడెన్ గా ఓ జోకర్ మాస్క్ పెట్టుకున్న యువకుడు ఎంట్రీ ఇచ్చేశాడు.
అయితే అతగాడు దారుణానికి పాల్పడ్డాడు.
వస్తూనే ప్రయాణికులపై విచక్షణా రహితంగా దాడి చేశాడు.
జపాన్ రాజధాని టోక్యోలో ఆదివారం సాయంత్రం ఈ దారుణం జరిగింది.అయితే అతగాడి దాడిలో దాదాపు 17 మంది గాయపడ్డారని సమచారం.
ఇందులో ఒకరి పరిస్థితి సీరియస్ గా ఉందని తెలుస్తోంది.అయితే అతను ఇలా బాట్మాన్ జోకర్ డ్రెస్ లో ట్రెయిన్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇంత దారుణానికి ఒడిగట్టడానికి కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.
ఇంకో విషయం ఏంటంటే దాడి అంతరం అతను ఆ బోగీ మీద పొట్రోల్ పోసి అంటించాడు.దీంతో ట్రెయిన్లో ఉన్న వారంతా కూడా కిటికీలు పగలగొట్టుకుని బయటకు వచ్చారు.