పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’ ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి ఓకే చేస్తూ వస్తున్నాడు.కాగా ఈ క్రమంలో దర్శకుడు క్రిష్ డైరెక్షన్లో పవన్ చేయబోయే సినిమాకు సంబంధించి రోజుకో వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తూ వస్తోంది.
ఈ సినిమాను రాబిన్హుడ్ తరహా చిత్రంగా తెరకెక్కించేందుకు క్రిష్ రెడీ అవుతున్నాడు.అయితే ఈ సినిమాకు టైటిల్ ఏం పెడతారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.కాగా ఈ సినిమాకు గజదొంగ, బందిపోటు వంటి టైటిల్స్ పెట్టబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపించింది.అయితే ఇవేమీ ఈ సినిమాకు టైటిల్ కాదని చిత్ర యూనిట్ తేల్చేసింది.
దీంతో ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ పెడతారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.కాగా తాజాగా ఈ సినిమాకు ‘హరిహర వీర’ అనే టైటిల్ను ఫిక్స్ చేయాలని చిత్ర యూనిట్ భాస్తున్నట్లు తెలుస్తోంది.
కోహినూర్ వజ్రం దోపిడికి సంబంధించి మొఘల్ సామ్రాజ్యంలో సాగే కథ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి.
కాగా ఈ సినిమాను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు క్రిష్ ప్రయత్నిస్తున్నాడు.
ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్గా ఎవరు నటిస్తారా అనే అంశంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.అయితే ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఈ సినిమాలో నటించబోతున్నట్లు ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
మరి ఈ సినిమాకు నిజంగానే ‘హరిహర వీర’ అనే టైటిల్ను తెరకెక్కిస్తారా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.ఏదేమైనా ఈ సినిమాపై అప్పుడే అంచనాలు మొదలవుతుండటం నిజంగానే విశేషమని చెప్పాలి.