టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి తరువాత హీరోయిన్ అయ్యి స్టార్ సెలబ్రెటీగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ రాశి.ఈ అమ్మడు తెలుగులో ఆ సమయంలో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ ,శ్రీకాంత్, జగపతి బాబు లాంటి స్టార్స్ అందరితో ఆడిపాడింది .స్టార్ హీరోయిన్ రేంజ్ గుర్తింపు అందుకుంది.తరువాత తాను ప్రేమించిన అసిస్టెంట్ దర్శకుడుని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపొయింది.
పెళ్లి తర్వాత కొంత విరామం తీసుకొని మళ్ళీ సినిమాలలోకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇచ్చింది.అడపాదడపా తల్లి పాత్రలు చేస్తూ వస్తుంది.అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి ఫేం తీసుకొచ్చే పాత్రని ఆమె వదులుకుంది.ఆ క్యారెక్టర్ చేసి ఉంటే రాశి ఫేట్ పూర్తిగా మారిపోయేది.
అదే రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర.ఈ పాత్ర కోసం దర్శకుడు సుకుమార్ ముందుగా రాశిని సంప్రదించారు.
అయితే ఆ పాత్ర చేయలేనని ఆమె రిజక్ట్ చేసింది.తరువాత అదే పాత్రలో అనసూయ నటించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవార్డులు అందుకోవడంతో పాటు స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది.ఇప్పుడు వరుస సినిమా అవకాశాలు తెచ్చుకుంటుంది.ఇదిలా ఉంటే రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర వదులుకోవడంపై రాశి తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పింది.రంగామ్మత్త క్యారెక్టర్ చివరి వరకు మోకాళ్ళు పై వరకు చీర కట్టుకొని కనిపించాలి.ఆ పాత్ర తన బాడీ లాంగ్వేజ్ కి సెట్ కాదు.
ఈ కారణంగానే గొప్ప పాత్ర అని తెలిసిన కూడా తప్పనిసరి పరిస్థితిలో వదులుకోవాల్సి వచ్చిందని పేర్కొంది.తనకి కంఫర్ట్ లేని పాత్రలు ఎంత గొప్పవైన చేయలేనని చెప్పింది.
గతంలో నిజం సినిమాలో అలా ఇష్టం లేకుండానే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించాల్సి వచ్చిందని తెలియజేసింది.