తెలుగు ఇండస్ట్రీ లోనే కాకుండా, భారతీయ సినీ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం “ఆర్ఆర్ఆర్”. ఈసినిమాను దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాలో కథానాయకుడి పాత్రలో మెగా వారసుడు రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఇప్పటికే రామ్ చరణ్ నటిస్తున్న అల్లూరి సీతారామరాజు పాత్రలో,ఎన్టీఆర్ నటిస్తున్న కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసినదే.
ఈ రెండు పాత్రలకు సంబంధించిన టీజర్స్ ఇప్పటికే విడుదలయ్యాయి.ఈ టీజర్స్ కి విశేష స్పందన రావడంతో ఈ సినిమాపై చిత్రబృందం భారీ అంచనాలు పెట్టుకున్నారు.దీపావళి పండుగ సందర్భంగా చిత్ర యూనిట్ ఫాన్స్ కి అదిరిపోయే గిఫ్ట్ కానుకగా ఇచ్చింది.సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఎన్టీఆర్, రామ్ చరణ్ లపై ఫోటో సెషన్ పెట్టి, వీరి ఫోటోలను దీపావళి కానుకగా విడుదల చేశారు.
మరొక ఫోటోలో ఈ ఇద్దరు హీరోలతో పాటు దర్శకధీరుడు రాజమౌళి కూడా భాగం పంచుకున్నారు.ప్రస్తుతం ఈ ముగ్గురు సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ఫోటోలను చూసిన అభిమానులకు నిజంగానే పండగ వాతావరణం ఏర్పడింది.
ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా, వారి సరసన అలియా భట్, ఒలివియ నటిస్తున్నారు.
అలాగే అజయ్ దేవగన్, శ్రియ, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణతో పాటు పలువురు హాలీవుడ్ నటులు ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు.ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు.
ఇంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పలు భారతీయ భాషలలో విడుదల కానుంది.బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా దర్శకత్వం వహిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు పెట్టుకున్నారు.
అయితే ఈ ముగ్గురు ఉన్న ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.