దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమా ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.
కాగా ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా, తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడు.
కాగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు.చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ హీరోయిన్గా నటిస్తోండగా, తారక్ సరసన ఫారిన్ బ్యూటీ ఒలివియా మారిస్ నటిస్తోంది.
అయితే ఇప్పటికే వీరిద్దరు సినిమా షూటింగ్లో పాల్గొనాల్సింది.కానీ లాక్డౌన్ కారణంగా వారు ఇంకా సినిమా షూటింగ్లో జాయిన్ కాలేదు.కాగా తాజాగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ చిత్ర దర్శకుడు రాజమౌళికి ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం షూటింగ్లకు అనుమతి లభించడంతో ఆర్ఆర్ఆర్ షూటింగ్ పరిస్థితుల గురించి ఆమె జక్కన్నతో మాట్లాడినట్లు తెలుస్తోంది.
లాక్డౌన్ కారణంగా ముంబైకే పరిమితమైన ఆలియా భట్, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.అయితే పరిస్థితులు ఇప్పట్లో చక్కబడే అవకాశాలు కనిపించడం లేకపోవడంతో, ఆలియా ఈ సినిమా నుండి తప్పుకోబోతుందనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.