ఐఆర్ఆర్ కేసులో అధికారిని మార్చడం వెనుక కుట్ర..: ధూళిపాళ్ల

ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విచారణాధికారిని మార్చడం వెనుక కుట్ర ఉందని ఆరోపించారు.

 Conspiracy Behind Transfer Of Officer In Irr Case: Dhulipalla-TeluguStop.com

ఐఆర్ఆర్ కేసులో దర్యాప్తు అధికారి ఏఎస్పీ జయరాజును ఎందుకు మార్చారని ధూళిపాళ్ల ప్రశ్నించారు.డీఎస్పీ స్థాయి అధికారి విజయ్ భాస్కర్ ను ఎందుకు నియమించారో చెప్పాలన్నారు.

ఏఎస్పీ స్థాయి అధికారి జయరాజు ప్రభుత్వం మాట వినడం లేదా అని నిలదీశారు.విచారణ కీలక దశలో ఉన్నప్పుడు బెయిల్ ఇవ్వొద్దని చెప్పే ప్రభుత్వం ఈ దశలో విచారణాధికారిని ఎలా మారుస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రానున్న ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి వచ్చేది తామేనని ధీమా వ్యక్తం చేశారు.ఈ క్రమంలో అధికార దుర్వినియోగానికి పాల్పడే వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube