తెలుగులో దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన “ఫిదా” చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో కనిపించి ప్రేక్షకులను బాగానే అలరించిన తెలుగు యువ నటి “గాయత్రి గుప్త” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.వచ్చి రావడంతోనే ఫిదా వంటి మంచి హిట్ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకున్నప్పటికీ తన తదుపరి చిత్రాల కథల విషయంలో సరైన నిర్ణయం తీసుకోక పోవడంతో గాయత్రి గుప్త ఈ మధ్యకాలంలో ఆశించిన స్థాయిలో రాణించలేక పోతోంది.
ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ అనుకోకుండా పలు వివాదాల్లో చిక్కుకోవడం తో ఈ అమ్మడి కెరియర్ చాలా చప్పగా సాగుతోంది.
అయితే ఈ మధ్య కాలంలో నటి గాయత్రి గుప్త పలు రకాల ఫొటో సంస్థలు నిర్వహిస్తున్న ఫోటోషూట్ కార్యక్రమాల్లో పాల్గొంటూ హాట్ హాట్ గా అందాల ఆరబోతతో కుర్రకారును గుండెల్లో హిట్ పెంచేస్తోంది.
తాజాగా ఈ అమ్మడు సిగరెట్ కాల్చుతూ పొగ వదులుతుండగా తీసినటువంటి ఫోటోలని తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.దీంతో ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
అంతేగాక ఈ అమ్మడి అందాల ఆరబోత కి ఫిదా అయిన నెటిజన్లు గాయత్రి “ఈజ్ ఆన్ ఫైర్” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ఈ మధ్య కాలంలో గాయత్రి గుప్త కి పెద్దగా సినిమా అవకాశాలు లేకపోవడంతో ఎక్కువగా ఇంటి పట్టునే ఖాళీగా గడుపుతోంది.
ఆ మధ్య “సీత ఆన్ రోడ్, అమర్ అక్బర్ ఆంటోనీ, కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్, జంధ్యాల రాసిన ప్రేమకథ, మిఠాయి” తదితర చిత్రాలలో నటించింది.కానీ ఈ అమ్మడి పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఎవరూ గుర్తించలేదు.
అయితే తాజాగా గాయత్రి గుప్త సినిమా అవకాశాలు లేకపోవడంతో వెబ్ సిరీస్ లపై దృష్టి సారించినట్లు సమాచారం.