ఈ విజయం తొలి అడుగు అంటూ కోర్టు తీర్పుపై వైయస్ షర్మిల సంచలన రియాక్షన్..!!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో వివేక హత్య కేసు కీలకంగా మారిన సంగతి తెలిసిందే.ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల( YS Sharmila ) ఈ కేసు ఆధారం చేసుకుని ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

 Ys Sharmila Reaction To The Supreme Comments On The Kadapa Court Verdict In The-TeluguStop.com

హంతకులను ప్రభుత్వం కాపాడుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.సరిగ్గా అదే సమయంలో వివేక హత్య కేసు పై మాట్లాడవద్దంటూ కడప కోర్టు( Kadapa Court ) ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది.

అయితే కడప న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను.షర్మిల సుప్రీంకోర్టులో( Supreme Court ) సవాల్ చేయడం జరిగింది.

ఈ క్రమంలో కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై.సుప్రీంకోర్టు స్టే విధించింది.

పూర్తి వాదనలు వినకుండా ఒకరి వాక్ స్వాతంత్రాన్ని.స్వేచ్ఛను ఎలా హరిస్తారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.దీంతో సుప్రీంకోర్టు తీర్పుపై వైయస్ షర్మిల సోషల్ మీడియాలో స్పందించారు.“దురాత్ముల నీచబుద్ధికి దిమ్మతిరిగేలా, మాడుపగిలేలా, వివేకానందరెడ్డి( Vivekananda Reddy ) గారి హత్య విషయంలో నిన్న సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.భావప్రకటన స్వేచ్ఛపై ఈ రాక్షసమూక చేయబోయిన దాడిని తిప్పికొట్టి, ఎప్పటికైనా ధర్మపోరాటంలో చివరికి న్యాయమే గెలుస్తుందని నిన్న నిరూపణ అయ్యింది.అధికార బలాన్ని ఉపయోగించి, మూర్ఖత్వంతో ఇలాంటి చిల్లర కుట్రలు చేసేవారికి ఈ స్టే చెంపపెట్టు.

ఈ విజయం తొలి అడుగు మాత్రమే.రాబోయే రోజుల్లో, వివేకకానంద రెడ్డి గారి కుటుంబానికి న్యాయం కోసం పోరాటం ఉధృతం చేస్తాము.

చిట్టచివరిగా విజయం, నిజం, న్యాయం వైపే ఉంటాయని చూపిస్తాం”.అంటూ పోస్ట్ పెట్టడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube