1.సోనియాతో నితీష్ లాలు భేటీ

నితీష్ కుమార్ , లాలూ ప్రసాద్ యాదవ్ ఇద్దరూ ఈరోజు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ కానున్నారు.
2.బిజెపి రాష్ట్ర అధ్యక్షుల సమావేశం
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సమావేశం ఈ నెల 27న జరగనుంది.
3.శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ భేటీ
శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ భేటీ ఈరోజు భేటీ అయింది.మొత్తం 25 ప్రతిపాదనలకు బోర్డు ఆమోదం తెలిపింది.
4.భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్

ఈరోజు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరగనుంది.
5.భారత్ జోడో పాదయాత్ర

నేడు 18వ రోజు భారత్ జూడో యాత్రలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు.
6.షర్మిల పాదయాత్ర
నేడు సంగారెడ్డి జిల్లాలో రెండో రోజు షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగుతుంది.
7.బతుకమ్మ వేడుకలు

తెలంగాణలో బతుకమ్మ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి .ఐదు గంటలకు రాజ్ భవన్ లో బతుకమ్మ వేడుకలను గవర్నర్ ఆడనున్నారు.
8.క్రికెట్ మ్యాచ్ కు గవర్నర్

ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ ను గవర్నర్ తమిళ సౌందర్య చూడనున్నారు.
9.గుర్రం జాషువా జయంతి
మహాకవి గుర్రం జాషువా 127వ జయంతి వారోత్సవాల్లో భాగంగా గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ నుండి వెంకటేశ్వర విజ్ఞానం మందిర్ వరకు పాదయాత్ర జరగనుంది.
10.సిఐడి చీఫ్ పర్యటన
శ్రీకాకుళం జిల్లాలో సిఐడి చీఫ్ సునీల్ కుమార్ పర్యటిస్తున్నారు.
11.సాగర్ ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తివేత

సాగర్ కు వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రాజెక్టు కు ఉన్న గేట్ల లో నాలుగింటిని అధికారులు ఎత్తి వేశారు.
12.శ్రీశైలానికి 48,504 క్యూసెక్కుల వరద
నంద్యాల జిల్లాలోని శ్రీ శైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది.ప్రస్తుతం 884.60 అడుగుల నీటి మట్టం ఉంది.
13.నేడు కొన్ని మార్గాల్లో ఎం ఎం టీ ఎస్ రైళ్ల రద్దు
నిర్వహణ పనులు కారణంగా ఈనెల 25న కొన్ని మార్గాలు ఎం ఎం టీ ఎస్ రైళ్ల ను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
14.తొక్కిసలాట పై విచారణ జరపాలి : టీ పీసీసీ
హైదరాబాదులో నేడు జరగనున్న ఇండియా ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ సంబంధించి టికెట్ల అమ్మకాలపై సమగ్ర విచారణ జరిపించాలని తెలంగాణ కాంగ్రెస్ కార్యాలయ నిర్వహణ అధక్షుడు మహేష్ కుమార్ డిమాండ్ చేశారు.
15.జగ్గారెడ్డి కామెంట్స్

సీఎం కేసీఆర్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొండి అంటూ సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు . పెన్షన్ల అంశంపై ఈ కామెంట్స్ చేశారు.
16.కిషన్ రెడ్డి కామెంట్స్
కెసిఆర్ తీరు చూసి ఇతర రాష్ట్రాలు ప్రజలు నవ్వుకుంటున్నారని కేంద్ర పర్యటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సెటైర్లు వేశారు.
17.రోజా కామెంట్స్

రాష్ట్రంలో మూడు రాజధానులు వచ్చి తీరుతాయని ఏపీ పర్యటక మంత్రి ఆర్కే రోజు అన్నారు.
18. బీజేపీ ఎంపీ జీవీయెల్ కామెంట్స్
యుగపురుషుడు ఎన్టీఆర్ నుంచి టిడిపిని దక్కించుకోవడం కోసం ఒకప్పుడు వెన్నుపోటు పొడిచి మరణానికి కారకులైన వారు ఈరోజు అతి ప్రేమను వరకు పోస్తున్నారని బిజెపి ఎంపీ జీవీయెల్ నరసింహారావు విమర్శించారు.
19. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రులు

ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,000
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 52,000
.







