మధుమేహం ఉన్నవారు మామిడిపండు తింటే ఏమవుతుందో తెలుసా?

వేసవికాలం మొదలు అయ్యిపోయింది.ఇక మామిడి పండ్లు విరివిగా లభిస్తాయి.

 Is It Safe To Eat Mangoes For Diabetics Patients Details, Mangoes, Diabetics Pat-TeluguStop.com

మామిడి పండు తినటం వలన మన శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి.మామిడి పండ్లను అందరు తినవచ్చు.

అయితే మధుమేహం ఉన్నవారు మామిడి పండు తినటానికి కాస్త వెనకడుగు వేస్తూ ఉంటారు.మామిడి పండు తింటే రక్తంలో చక్కర స్థాయిలు పెరుగుతాయని భావిస్తారు.

దాంతో మామిడిపండుకి దూరంగా ఉంటారు.అసలు మధుమేహం ఉన్నవారు మామిడి పండును తినవచ్చా? తింటే ఏమి అవుతుందో తెలుసా? ఇప్పుడు దాని గురించి వివరంగా తెలుసుకుందాం.

సాధారణంగా మీడియం సైజ్ మామిడి పండు నుంచి లభించే కేలరీలు ఒక‌టిన్న‌ర గోధుమ రొట్టెలో ఉన్న కేలరీలతో సమానం.కాబట్టి మధుమేహం ఉన్నవారు మామిడిపండును తినవచ్చు.అయితే భోజనం చేసిన వెంటనే మాత్రం మధుమేహం ఉన్నవారు మామిడిపండుకు తినకూడదు.ఎందుకంటే భోజనం చేసినప్పుడు మన శరీరంలోకి అవసరమైన కేలరీలు చేరతాయి.

భోజనం అయ్యాక మామిడిపండు తింటే కేలరీలు ఎక్కువై కొవ్వుగా మారే అవకాశం మరియు రక్తంలో చక్కర స్థాయిలు పెరిగే అవకాశం ఉన్నాయి.

Telugu Diabetics, Mangoes, Mangoes Sugar, Sugar, Telugu Tips-Telugu Health

అయితే మధుమేహం ఉన్నవారు మామిడిపండు తినటానికి ఒక సమయం ఉంది.ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ మధ్య లేదా మ‌ధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్న‌ర్ మధ్య ఉండే స‌మ‌యంలో  తింటే ఎటువంటి సమస్య రాదు.రక్తంలో చక్కర స్థాయిలు కూడా పెరగవు.

మామిడిపండు గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది.అంటే 100 కి 56 మాత్రమే ఉంటుంది.

కాబట్టి మ‌ధుమేహం ఉన్న వారు ఎటువంటి భయాలు లేకుండా మామిడి పండ్ల‌ను తిన‌వ‌చ్చు.అయితే వాటిని పైన చెప్పిన స‌మయాల్లో తింటేనే షుగ‌ర్ లెవ‌ల్స్ పెర‌గ‌కుండా ఉంటాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube