తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది.అది అన్నగారు తెచ్చుకున్న ఒక ప్రెస్టేజ్.
అన్నగారి కాలం నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీ ఇమేజ్ ఇంకా తగ్గలేదు.తెలంగాణ లో మారిన రాజకీయ సమీకరణాల కారణంగా కొంత డామేజ్ జరిగినా.
ఆంధ్రా లో మాత్రం చెక్కు చెదరలేదు.అయితే 2019 ముందు వరకు ఆ పార్టీ పరిస్థితి ఒక రేంజ్ లో ఉండేది.
ఒక్క 2019 ఎన్నికలు ఆ పార్టీ గతినే మార్చేశాయి.
ఒంటరిగా రంగం లోకి దిగిన టీడీపీ.కేవల 23 సీట్లకు పరిమితం అయింది.అక్కడి నుంచి ఆపసోపాలు పడుతూ చంద్రబాబు పార్టీని కాపాడుకుంటు వస్తున్నారు.
ఇక లోకేష్ కూడా రాజకీయంగా ఫెయిల్ కావడం తో బాబు తనని తాను నమ్ముకున్నాడు.దాంతో వైసీపీ ఆయన సీటును టార్గెట్ చేసింది.
ఒక్క కప్పాన్ని కొడితే.టీడీపీ డిలా పడిపోతుందని ప్లాన్ చేస్తున్నారు.
అందులో భాగంగా.అక్కడ మునిసిపాలిటీ నీ.గ్రామ పంచాయితీల ను స్వంతం చేసుకున్నారు.ఇక వచ్చే ఎన్నికల్లో వాటిని ఉపయోగించి.
బాబును ఒడించాలి అని చూస్తున్నారు.ఇక్కడే ఇంకో పావును వైసీపీ వాడుతుంది.
అదేంటంటే.జూనియర్ ఎన్టీఆర్.
ఆయనకు కుప్పం లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది.అయితే కుప్పం టీడీపీ నేతలకు మాత్రం జూనియర్ ఫ్యాన్స్ అంటే నచ్చడం లేదు.
దీన్ని అడ్డు పెట్టుకొని.కుప్పం మునిసి పాలిటి నీ వైసీపీ గెలిచింది.
ఇప్పుడు సేమ్ ఫార్ములాతో.అసెంబ్లీ నీ గెలవాలని చూస్తోంది.
అందుకే చంద్రబాబు పర్యటన ను సైతం అనిచి వేయడానికి.అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
అయన సభలకు సైతం అనుమతులు ఇవ్వడం లేదు.మరి.ఇక్కడ బాబు సెంటిమెంట్ పని చేస్తుందా.? లేక వైసీపీ ప్లాన్ పని చేస్తుందా తేలాలంటే.2024 ఎన్నికలు రావాల్సిందే.