పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ప్రెసెంట్ నాలుగైదు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.అందులో ‘సలార్’ సినిమా ఒకటి.
కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాను హోంబళ్లే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తుండగా.
శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.ప్రెసెంట్ ప్రభాస్ అభిమానులు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుకుంటున్నారు.
ఈ సినిమా సంక్రాంతి 2022 లోనే రిలీజ్ చేస్తామని చెప్పారు.కానీ ఈ సంక్రాంతి పోయింది.ఇక ఇప్పుడు 2023 లో అయినా రిలీజ్ చేస్తారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఈ సినిమా కోసం సౌత్ ఇండస్ట్రీ గత కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్నారు.
అయితే ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ సినిమాతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా షూటింగ్ కు గ్యాప్ వచ్చింది.
కెజిఎఫ్ చాప్టర్ 1 ఏ రేంజ్ హిట్ నో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
దీంతో చాప్టర్ 2 స్టార్ట్ చేసి షూటింగ్ కూడా పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచారు.రెండేళ్ల నుండి ఈ సినిమా కోసం సౌత్ ఇండియా మాత్రమే కాదు బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఎదురు చూస్తున్నారు.
ఇంకా ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా పెరిగాయి.ఈ నెల 14న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
ఇక నీల్ తెరకెక్కిస్తున్న సలార్ సినిమా 30 శాతం షూటింగ్ పూర్తి అయ్యింది.ఈ సినిమా నుండి అప్డేట్ కోసం డార్లింగ్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పటి వరకు పోస్టర్స్ వచ్చాయి కానీ టీజర్ మాత్రం రిలీజ్ కాలేదు.దీంతో ఈ సినిమా టీజర్ పై ఆసక్తికర చర్చ జరుగుతుంది.
ఈ సినిమా టీజర్ ను యూనివర్సల్ లెవల్ లో రెడీ చేయబోతున్నారట.
అంటే అన్ని భాషలకు కలిపి డైలాగ్స్ లేకుండా ఒకే టీజర్ ను రెడీ చేసినట్టు తెలుస్తుంది.కెజిఎఫ్ స్క్రీనింగ్ అవ్వబోతున్న ప్రతి చోట సలార్ టీజర్ కూడా స్క్రీనింగ్ చేయనున్నట్టు కన్నడ మీడియా వర్గాల నుండి సమాచారం అందుతుంది.ఇదే జరిగితే ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఇవ్వడం ఖాయం.
అయితే కెజిఎఫ్ సందడిలో సలార్ టీజర్ ను నిజంగానే రిలీజ్ చేయబోతున్నారా లేదంటే ఇది ఒట్టి గాలి వార్తనేనా అనేది తెలియాల్సి ఉంది.