మెగా హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తో దాదాపుగా రెండు నెలలు పూర్తిగా కనిపించకుండా పోయాడు.ఆ సమయంలో తేజ్ ఆరోగ్యం గురించి అభిమానులు చాలా ఆందోళన వ్యక్తం చేశారు.
దీపావళి సందర్బంగా మెగా హీరోలు అందరు కలిసి ఫొటోలు దిగి షేర్ చేశారు.కాని అందులో సాయి ధరమ్ తేజ్ లేక పోవడంతో రకరకాల అనుమానాలు మొదలు అయ్యాయి.
ఎట్టకేలకు సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నట్లుగా చిరంజీవి స్వయంగా ప్రకటించాడు.సాయి ధరమ్ తేజ్ కూడా సోషల్ మీడియాలో నేను పూర్తిగా కోలుకున్నాను అంటూ ప్రకటించాడు.
నా ఆరోగ్యం బాగుంది అంటూ తేజ్ నుండి వచ్చిన ఈ ప్రకటన అభిమానులకు కొండంత ధైర్యంను ఇచ్చింది.చాలా రిలాక్స్ అయ్యారు.
అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు తేజ్ కనిపించడంతో షూటింగ్ కు రెడీ అంటూ ప్రశ్నిస్తున్నారు.శారీరకంగా పూర్తిగా కోలుకున్న సాయి ధరమ్ తేజ్ షూటింగ్ లకు రెడీగా ఉన్నాడట.
కాని మామయ్యలు చిరంజీవి.పవన్ లు మాత్రం షూటింగ్ కు కొన్ని రోజుల తర్వాత వెళ్లాల్సిందిగా సూచించారట.
సాయి ధరమ్ తేజ్ ఆసుపత్రి బెడ్ మీద ఉన్న సమయంలోనే ఆయన నటించిన రిపబ్లిక్ సినిమా విడుదల అయ్యింది.ఆ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కినా కూడా వసూళ్లు మాత్రం రాలేదు.
రిపబ్లిక్ తర్వాత సాయి ధరమ్ తేజ్ చేయాల్సిన సినిమా ఏంటీ.దాన్నే చేయబోతున్నాడా లేదంటే మరేదైనా సినిమాను కమిట్ అయ్యాడా అనేది చర్చనీయాంశంగా మారింది.
క్షుద్ర శక్తులపై పోరాటం నేపథ్యంలో సాయిధరమ్ తేజ్ ఒక సినిమాను చేసేందుకు ఓకే చెప్పాడు.
సుకుమార్ సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను కార్తీక్ దండు దర్శకత్వంలో నిర్మించేందుకు సిద్దం అయ్యాడు.సాయి ధరమ్ తేజ్ 15వ సినిమాగా అధికారికంగా ప్రకటించారు.కాని యాక్సిడెంట్ అయిన నేపథ్యంలో ప్లాన్ మార్చే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు.
సినిమా ప్రకటించిన తర్వాత ఇలా జరగడం ను సెంటిమెంట్ గా భావిస్తున్నారు.ఇండస్ట్రీలో సెంటిమెంట్ లను కాస్త ఎక్కువగానే పాటిస్తారు.
అందుకే ఆ సినిమా పట్టాలెక్కడం అనుమానమే అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరి తేజ్ ఆ సినిమాను కాదంటే మరే సినిమాను చేస్తాడు అనేది చూడాలి.