పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ప్రస్తుతం ఊహించని స్థాయిలో ఉంది.పవన్ సినిమాలు నిర్మాతలకు భారీ లాభాలను అందిస్తుండటంతో పవన్ తో సినిమాలను నిర్మించడానికి ఆసక్తి చూపుతున్న ప్రొడ్యూసర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
అయితే గత రెండు రోజులుగా పవన్ భార్య అన్నా లెజినోవా పిల్లల చదువు కోసం సింగపూర్ లో సెటిల్ కానున్నారని ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది.
అన్నా లెజినోవా గత కొన్ని నెలలుగా రష్యాలో నివాసం ఉంటున్నారని పిల్లల్ని సింగపూర్ లేదో మరో దేశంలో చదివించాలని ఆమె భావిస్తున్నారని బోగట్టా.
అయితే ఏపీలో పవన్ ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించారని తన పిల్లలను మాత్రం విదేశీ బడుల్లో చదివించాలని అనుకుంటున్నారని కొంతమంది పవన్ కళ్యాణ్ ను తీవ్రస్థాయిలో ట్రోల్ చేస్తున్నారు.అధికారికంగా పవన్ పిల్లలు సింగపూర్ లో చదువుతారని సమాచారం లేకపోయినా ఈ తరహా ప్రచారం జరుగుతుండటం గమనార్హం.
పవన్ పిల్లలకు విదేశీ విద్య కావాలా? ఆంధ్ర పిల్లలు మాత్రం తెలుగు మీడియంలో చదువుకోవాలా? అంటూ కొంతమంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.అయితే ఇదే సమయంలో పవన్ అభిమానులు సైతం నెగిటివ్ కామెంట్ల గురించి ధీటుగా స్పందిస్తున్నారు.
పవన్ ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకమని ఏరోజు ప్రకటన చేయలేదని తల్లిదండ్రుల ఇష్టానికి పిల్లలు ఏ మీడియంలో చదవాలో వదిలేయాలని మాత్రమే కోరారని పవన్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ఇప్పటికే చాలామంది ప్రముఖుల పిల్లలు విదేశాలలో చదువుకుంటున్నారని పవన్ పిల్లలు కూడా విదేశాలలో చదివినా అందులో తప్పేంటని పవన్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.పవన్ పిల్లల గురించి ప్రచారంలోకి వచ్చిన షాకింగ్ రూమర్ వల్ల నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.పవన్ ప్రస్తుతం భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు సినిమాలలో నటిస్తుండగా ఈ రెండు సినిమాలు కొన్ని నెలల గ్యాప్ లో విడుదల కానున్నాయి.