పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘రాధేశ్యామ్’.ఇది 1970 కాలం నాటి ఇటలీ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమ కథ.
మొన్ననే ఈ సినిమా నుండి టీజర్ వదిలారు.ప్రేమ కథకు అద్బుతమైన గ్రాఫిక్స్ యాడ్ చేసి టీజర్ ను వదిలారు.
దీంతో ఈ టీజర్ అభిమానులను బాగా ఆకట్టుకుంది.అయితే ఈ టీజర్ చూస్తేనే అర్ధం అవుతుంది.
ఈ సినిమా అన్ని ప్రేమ కథల లాగా మాములుగా ఉండదని.
ఇక ఇందులో ప్రభాస్ హస్తసాముద్రిక నిపుణుడిగా నటిస్తుంటే పూజా ప్రేరణ రోల్ లో కనిపించ బోతుంది.
అయితే ఈ సినిమాలో అన్నిటికంటే క్లైమాక్స్ అద్భుతంగా తీర్చిదిద్దారని.చాలా ప్రత్యేకంగా ఉంటుందని దీనికోసమే ఏడాది కాలం పాటు పనిచేశానని.
ఈ క్లైమాక్స్ ఎప్పటికి గుర్తుండిపోయే విధంగా ఉంటుందని… ఇలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను తెలిపాడు ఈ సినిమా సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస.
ఆయన ఇటీవలే ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.”రాధేశ్యామ్ క్లైమాక్స్ పై నేను దాదాపు సంవత్సరం నుండి పని చేస్తున్నాను.ఇలాంటి క్లైమాక్స్ ఎగ్జిక్యూట్ చేయడం.
ప్రేక్షకులను ఒప్పించడం సామాన్య విషయం కాదని అది అంత ఈజీ కాదని తెలిపాడు.ఈ సినిమా క్లైమాక్స్ కోసం రీసెర్చ్ చేస్తూనే ఉన్నామని వీక్షకులకు ఈ సినిమా క్లైమాక్స్ లో అనేక ఆసక్తికర విషయాలు చూపించ బోతున్నామని.
ఆయన చెప్పుకొచ్చారు.
మరి మొత్తానికి రాధేశ్యామ్ క్లైమాక్స్ ఎవ్వరు ఊహించని విధంగా ఇంకా చాలా స్పెషల్ గా ఉండబోతుందని ఆయన చెప్పకనే చెప్పారు.
మరి ఈ సినిమాలో క్లైమాక్స్ ను రాధాకృష్ణ ఎలా తీర్చి దిద్దాడో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి ఉండాలి.ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతి విడుదల చేయబోతున్నారు.