టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రెగ్యులర్ గా పార్టీలు ఇస్తూనే ఉంటాడు.ఆయనకు పార్టీలు, పబ్ లు కొత్తేమి కాదు.
తాజాగా ఈయన మరొక పార్టీ ఇచ్చాడు.అయితే ఈసారి మాత్రం చాలా స్పెషన్ అని అంటున్నారు.
ఎందుకంటే ఈసారి పూరీ ఆయన కొడుకు సక్సెస్ పార్టీ ఇచ్చాడట.ఈ మధ్యనే ఆకాష్ పూరీ నటించిన రొమాంటిక్ సినిమా విడుదల అయ్యింది.
ఈ సినిమా విడుదల అయ్యి మిశ్రమ స్పందన తెచ్చుకుంది.
అయితే ముందు నుండి ఈ సినిమాకు చేసిన ప్రమోషన్స్ కారణంగా ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.
అంతేకాదు ఆకాష్ నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి.అలాగే కొన్ని సన్నివేశాల్లో పూరీ స్టైల్ ఆఫ్ స్క్రీన్ ప్లే బాగుందని చాలా మంది తెలిపారు.ఇక ఈ సినిమాను ఛార్మి, పూరీ జగన్నాథ్ సంయుక్తంగా నిర్మించారు.ఎక్కువ బడ్జెట్ లేకుండా తక్కువలోనే సినిమాను నిర్మించినా కూడా బాగానే తెరకెక్కించారు.
ఇక ఈ సినిమా పూరీ కి లాభాలను తెచ్చిపెట్టిందట.సినిమా విడుదలకు ముందే ధియేటరికల్ రైట్స్, ఇతర రైట్స్ ద్వారా లాభాలు రావడం వల్ల అలాగే ఆకాష్ కు కూడా ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు రావడంతో పురీ ఆ సంతోషంలో రొమాంటిక్ టీమ్ అందరికి పార్టీ ఇచ్చాడట.ఆకాష్ ఈ సినిమాతో సక్సెస్ అవ్వడంతో తర్వాత సినిమాలపై ఆసక్తి పెరగడం ఖాయం.అందుకే అన్నిటికి కలిపి ఈ పార్టీ అని చెబుతున్నారు.
ఇక ఇది ఇలా ఉంటే ప్రెసెంట్ పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ తో లైగర్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ప్రెసెంట్ షూటింగ్ జరుపుకుంటుంది.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుండడంతో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.ఇక ఈ సినిమా వచ్చే సమ్మర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.