తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఒకవైపు బుల్లితెరపై యాంకర్ గా వ్యవహరిస్తూనే మరోవైపు వెండి తెరపై అడపాదడపా సినిమాల్లో నటిస్తోంది.
ఈ క్రమంలోనే రేష్మి గుంటూరు టాకీస్ సినిమాలో ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ సినిమా తరువాత రష్మి రాణి గారి బంగళా అని హర్రర్ సినిమాల్లో నటించింది.
అయితే ఈ సినిమా సమయంలో సినిమా నిర్మాత తెలియదు డిస్ట్రిబ్యూటర్ అయినా బాలాజీ నాగలింగం కీ, రష్మీ కి మధ్య పెద్ద యుద్ధమే జరిగిందట.రష్మి షూటింగ్కి రాకపోవడంతో పాటు హీరోని కూడా మార్చేయాలని గోల చేయడంతో.
అగ్రిమెంట్ ప్రకారం వచ్చి షూటింగ్ కంప్లీట్ చేయకపోతే ఫిల్మ్ నగర్ గేటుకి కట్టేసి కొడతానంటూ రష్మికి బహిరంగానే వార్నింగ్ ఇచ్చారట నిర్మాత బాలాజీ నాగలింగం.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన రష్మీ తనను ఎన్ని ఇబ్బందులు పెట్టిందో చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.రష్మీ ని ఫిలింనగర్ గేటుకి కట్టేసి కొడతా అని అన్న మాట నిజమే.
ఆమె నన్ను ఎంతో బాధ పెట్టడం వల్ల నేను ఆ మాట అనాల్సి వచ్చింది అని తెలిపారు బాలాజీ నాగలింగం.రష్మీ రాణి గారి బంగ్లా సినిమా చేస్తోంది.
ఆ సినిమాలో హీరోయిన్ రష్మీ తీసుకున్నాం.ఇక ఆ సినిమా డైరెక్టర్ నా ఫ్యామిలీ మెంబర్స్ కావడంతో నా ప్రొడక్షన్ లోనే ఆ సినిమాను చేశాము అని తెలిపారు.
మొదట రష్మికి ఈ సినిమా కథ వినిపించినప్పుడు ఆమె కూడా ఓకే అయిందని, డేట్స్ కూడా ఇచ్చిందని, ఆమె అడిగిన అమౌంట్ కి అగ్రిమెంట్ కూడా అయిపోయిందని, ఇక తీర షూటింగ్ అంతా అయిపోయి ఒక సాంగ్ డబ్బింగ్ బ్యాలెన్స్ ఉన్న సమయంలో ఆమె ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టింది అని తెలిపారు.
ఆమెకు రెమ్యునరేషన్ గురించి,ఈ సినిమా బడ్జెట్ గురించి,ప్రొడక్షన్కి గురించి.ఆమెకు ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో అన్నీ వివరంగా చెప్పినప్పటీకి, ఆమె సినిమా పూర్తయ్యే సమయం లో చాలా ఎక్కువ అమౌంట్ అడిగిందని,గుంటూరు టాకీస్ సినిమా హిట్ కావడంతో భారీగా రెమ్యునరేషన్ అడిగిందని,చివరికి మేం ఇస్తాం అన్నదానికే ఓకే చెప్పి సినిమా చేసింది.చివరికి సాంగ్కి వచ్చేసరికి ఆ హీరోతో నేను చేయను.
అతన్ని మార్చేయండి అని మాట్లాడటంతో,నేను ఓపిక నశించి ఫిలిం నగర్ గేటుకి కట్టేస్తా అన్న మాటని చెప్పింది కానీ. ఆ మాటకి దారితీసిన పరిస్థితుల్ని మాత్రం చెప్పలేదు.
నాకు వాళ్లు తెల్సు.వీళ్లు తెల్సు.నాగబాబు గారు తెలుసు.శ్యాం బాబు తెలుసు.అని నన్ను బెదిరించింది.ఆ మాటలన్నీ రికార్డ్ ఉన్నాయి.
అని చెప్పుకొచ్చారు నిర్మల్ నాగలింగం.అంతేకాకుండా ఆ సమయంలో రష్మీ తనని బెదిరించిందని, బ్లాక్ మెయిల్ కూడా చేసిందని తెలిపారు.
అలా ఆ సినిమాలో చివరి పాట కోసం దాదాపుగా మూడు నెలలు వెయిట్ చేయాల్సి వచ్చిందని తెలిపారు.సినిమా పూర్తయిన తర్వాత చాలా మంది దర్శక నిర్మాతలకు రష్మీ ని సినిమాల్లో పెట్టుకోవద్దు అని నేనే చెప్పాను ఎందుకంటే నేను పడ్డ ఇబ్బందులు వారి పడకూడదు అని చెప్పుకొచ్చారు నిర్మాత నాగలింగం.