ప్రియాంక జవాల్కర్ బ్రహ్మాజీ, సత్యదేవ్ ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం తిమ్మరసు.ఈ సినిమా కరోనా రెండవ దశ తర్వాత విడుదల అయి మంచి టాక్ సంపాదించుకున్న కలెక్షన్ల పరంగా మాత్రం అధిక వసూళ్లను రాబట్టలేకపోయింది.
ఇక ఈ సినిమా తర్వాత బ్రహ్మాజీ సత్యదేవ్ ప్రియాంకలకు మంచి అవకాశాలు వస్తున్నాయని చెప్పవచ్చు.ఇకపోతే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన శరణ్ కొప్పిశెట్టి తాజాగా నటి ప్రియాంకకు అల్పాహారం పంపినట్లు తెలుస్తోంది.
ఈ విషయాన్ని నేరుగా ప్రియాంక తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ శరణ్ కొప్పిశెట్టి వంటి స్నేహితులు ఉంటే మనకోసం ఇడ్లీలు పంపిస్తారు అంటూ చెప్పడమే కాకుండా మీకెప్పుడైనా ఇలాంటివి పంపించారా అంటూ బ్రహ్మాజీ, సత్యదేవ్ ను ప్రశ్నిస్తూ.చూశారా ఆయనకు నేనే స్పెషల్ అంటూ చెప్పుకోవడమే ఆలస్యం వెంటనే బ్రహ్మాజీ స్పందిస్తూ ఆమె పరువు మొత్తం తీసేసాడు.
ఈ క్రమంలోనే బ్రహ్మాజీ మాట్లాడుతూ మాకు ఇలాంటి టిఫిన్స్ పంపించరు మాకు బిర్యానీ పంపిస్తారు అంటూ ప్రియాంక పరువు మొత్తం తీసేసాడు.
ఇలా తిమ్మరుసు చిత్రం తర్వాత ఎంతో సన్నిహితంగా ఉండే వీరు పరస్పరం ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటూ ఉంటారు.ఈ మరి చిత్రం తర్వాత ప్రియాంకకు ఎన్నో అవకాశాలు వచ్చాయి.ఇక సత్యదేవ్ ఏకంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకొని ఎంతో బిజీగా ఉన్నారు.
ఈ చిత్రం పాజిటివ్ టాక్ సంపాదించుకొన్నప్పటికీ కలెక్షన్లు రాబట్టలేకపోయింది.ఇక ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన మహేష్ కోనేరు తాజాగా గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే.