మంగళవారం రాత్రి హైదరాబాద్ లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గరకి వచ్చి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఈ రోజు హాస్పిటల్ లో చనిపోయింది.లోకేశ్వరి అనే మహిళ నిన్న రాత్రి స్టేషన్ దగ్గరకి వచ్చి తనతో తెచ్చుకున్న పెట్రోల్ ఒంటి మీద పోసుకొని నిప్పు అంటించుకుంది.
పోలీసులు వెంటనే ఆమె మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ తీవ్రగాయాలయ్యాయి.దీంతో ఆమెని వెంటనే హాస్పిటల్ కి తరలించారు.
ఆమె ఆత్మహత్యాయత్నం కారణంగా పంజాగుట్ట రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.ఆస్పత్రిలో చికిత్స పొందుతూ లోకేశ్వరి చనిపోయింది.
గతంలో కూడా లోకేశ్వరి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పలు కేసులు పెట్టింది.చెన్నైలో నివాసం ఉంటున్న ఆమెని ఓ వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు.
దీనిపై ఆమె గతంలో పోలీసులకి ఫిర్యాదు చేసింది.అయితే తనకి న్యాయం జరగకపోవడంతో ఆనే మంగళవారం సాయంత్రం పోలీస్ స్టేషన్ దగ్గరకి వచ్చి ఆత్మహత్యాయత్నం చేసింది.
ఈ ఘటనపై యువతి తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం ఇచ్చారు.అయితే పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఒక మహిళా ప్రాణం పోయిందని మహిళా సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.
తక్షణం ఆమె కేసుని నిర్లక్ష్యం చేసిన పోలీసులపైచ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.