మనలో చాలామందికి డబ్బు బాగా సంపాదించాలని, ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్ష ఉంటుంది.అయితే కొన్ని సందర్భాల్లో ఎంత కష్టపడినా ఎక్కువ డబ్బు సంపాదించడం సాధ్యం కాదు.
రోజురోజుకు పెరుగుతున్న ఖర్చుల వల్ల ఆదాయం పెరుగుతున్నా పొదుపు చేయడం చాలామందికి సాధ్యం కావడం లేదు.కరోనా, లాక్ డౌన్ సమయంలో ఆదాయం లేక చాలామంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అయితే డబ్బు సంపాదించడం కష్టం కాదని.ఇలా ప్లాన్ చేస్తే సులువుగా డబ్బు సంపాదించవచ్చని మెగాబ్రదర్ నాగబాబు ప్రజలకు సూచిస్తున్నారు. “మన ఛానల్… మన ఇష్టం” అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా డబ్బు ఎలా సంపాదించాలో, డబ్బులు సంపాదించడానికి అర్హత లేనివాళ్లెవరనే విషయాలను వెల్లడించారు.సోమరిపోతులకు డబ్బు సంపాదించడం చేత కాదని, వీళ్లకు డబ్బు సంపాదించే అర్హత లేదని నాగబాబు తెలిపారు.
సోమరిపోతులు వ్యాపారంపై సరిగ్గా దృష్టి పెట్టలేరు కాబట్టి త్వరగా నష్టపోతారని పేర్కొన్నారు.సోమరితనం ఆఫీస్ కెళ్లి పని పూర్తి చేశామా.? లేదా.? అనే విషయాలు మాత్రమే ఆలోచించేలా చేస్తుందని.అంతకు మించి మనిషి ఆలోచనా శక్తిని సోమరితనం ఎదగనీయదని పేర్కొన్నారు.తాతల సంపాదనపై ఆధారపడేవాళ్లు ఎప్పటికీ ఎదగరని చెప్పారు.దురలవాట్లు ఉన్నవాళ్లు కూడా సక్సెస్ కాలేరని.వీళ్లకు కూడా డబ్బు సంపాదించే అర్హత లేదని అన్నారు.
జీవితాన్ని ప్రణాళికాబద్ధంగా మలచుకుని.క్రమశిక్షణగా మెదలాలని సూచించారు.ఎవరైనా డబ్బు సంపాదించాలని అనుకుంటే సోమరితనాన్ని వదిలేయాలని, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవరచుకోవాలని, ఇతరులతో నిజాయితీగా ఉండాలని, దురలవాట్లకు దూరంగా ఉండాలని, మంచి ఆరోగ్యం సంపాదించుకోవాలని, వెల్ ప్లానింగ్ గా ఉండాలని ఇలా ఉంటే సులభంగా ఎంత డబ్బైనా సంపాదించడం సాధ్యమని నాగబాబు పేర్కొన్నారు.ఎవరికైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయాలని రాబోయే వీడియోలలో ఆ ప్రశ్నలకు సమాధానలు ఇస్తానని నాగబాబు తెలిపారు.