తెలుగు ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ జెమిని టీవీ రేంటింగ్ విషయంలో చాలా వెనుక పడ్డింది.ఈటీవీ మరియు మాటీవీ ఇంకా జీ తెలుగుల తర్వాత స్థానంలో జెమిని టీవీ నిలిచింది.
దాంతో ఎలాగైనా మళ్లీ టాప్ కు రావాలనే ఉద్దేశ్యంతో భారీగా ఖర్చు చేసి ఎన్టీఆర్ తో ఎవరు మీలో కోటీశ్వరులు మరియు తమన్నాతో మాస్టర్ చెఫ్ ను మొదలు పెట్టారు.తెలుగు లో ఈ రెండు షో లు ఖచ్చితంగా మంచి హిట్ అయ్యి జెమిని టీవీని మంచి స్థాయికి తీసుకు వెళ్తాయి అనుకుంటే నిరాశ మిగిల్చాయి.
ఏమాత్రం రేటింగ్ ను పెంచక పోగా నష్టాలను మిగిల్చింది.ముఖ్యంగా తమన్నా హోస్ట్ గా చేసిన మాస్టర్ చెఫ్ తో జెనిమి టీవీకి పరువు పోయినంత పనైంది.
ఒకటి రెండు టీఆర్పీ రావడంతో ఏం చేయాలో పాలుపోక తమన్నాను తప్పించారు.అది కాస్త మరింత వివాదంగా మారి జెమిని టీవీ వారికి చిక్కులు తెచ్చి పెట్టింది.
జెమిని టీవీ వారు చెప్ప పెట్టకుండా తమన్నాను తీసేసి మాస్టర్ చెఫ్ కు హోస్ట్ గా జబర్దస్త్ ముద్దుగుమ్మ అనసూయను తీసుకు వచ్చారు.దాంతో తమన్నాకు కోసం వచ్చింది.
తనను మద్యలో ఎలా తొలగిస్తారు అంటూ ప్రశ్నించింది.తనకు రావాల్సిన పారితోషికం చెల్లించాల్సిందే అంటూ కోర్టును కూడా ఆశ్రయించింది.
మొత్తానికి ఈ వివాదం చాలా పెద్ద ఇష్యూగా మారుతుంది అనుకుంటున్న సమయంలో సైలెంట్ అయ్యింది.
అనూహ్యంగా ఎందుకు సైలెంట్ అయ్యిందా అనుకుంటూ ఉండగా ఇండస్ట్రీ వర్గాల వారు ఈ విషయాన్న రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేశారట.సన్ నెట్ వర్క్ వారితో మాట్లాడి ఈ విషయంలో ఒక స్పష్టమైన రాజీని కుదిర్చారు అంటున్నారు.తమన్నాకు వచ్చిన నష్టంను భర్తీ చేయడంతో పాటు జెమిని టీవీ వారి విషయంలో కూడా కాస్త న్యాయం చేసినట్లుగా చెబుతున్నారు.
మొత్తానికి తమన్నా మరియు జెమిని టీవీ వారి మద్య ఉన్న గొడవ లు పూర్తిగా తొలగి పోయినట్లే అంటున్నారు.