చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై మంత్రి రోజా తీవ్రంగా మండిపడ్డారు.ఇద్దరూ తోడు దొంగలని పేర్కొన్నారు.
చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ కోసం పని చేసే దత్తపుత్రుడు పవన్ అని విమర్శించారు.
పొత్తులో ఉన్న బీజేపీతో చర్చించకుండా టీడీపీతో కలిసి పని చేస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించారని మంత్రి రోజా తెలిపారు.
చంద్రబాబు తరహాలోనే చేసిన అవినీతికి లోకేశ్ కూడా త్వరలోనే జైలుకు వెళ్తారని చెప్పారు.స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అవినీతి జరగలేదని భావిస్తే సీబీఐ, ఈడీ విచారణకు సిద్ధమని లోకేశ్, భువనేశ్వరి ప్రకటించాలని ఆమె సూచించారు.