అమెరికాలో ఎన్నో తెలుగు సంఘాలు వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉంటాయి.అలాగే డల్లాస్ లో తెలంగాణా ప్రజా సమితి (టీపాడ్) ఆధ్వర్యంలో కూడా గత 6 ఏళ్లుగా రక్తదాన శిబిరం నిర్వహించబడుతోంది.
ఈ కార్యక్రమం శనివారము మార్చ్ ఐ.టి.స్పిన్ ఆఫీస్ ప్రాంగణము, ప్లేనో డాలస్ నగరములో జరిగింది.
“కార్టర్ బ్లడ్ కేర్ సంస్థ” ఈ కార్యక్రమంలో రక్తాన్ని సేకరించింది.దాదాపు 50 మంది రక్త దాతల నుండి 32 యూనిట్లు అంటే 8000ml రక్తం సేకరించారని సంస్థ ప్రతినిధులు తెలిపారు.ప్రతి యూనిట్ రక్తం ముగ్గురు వ్యక్తులను ప్రాణాపాయం నుండి కాపాడవచ్చునని సంస్థ నిర్వాహకులు తెలిపారు.అయితే
ఈ కార్యక్రమంలో సేకరించిన రక్తం సుమారు 96 మంది ప్రాణాలు కాపడచ్చని “కార్టర్ బ్లడ్ కేర్ సంస్థ” తెలిపింది.ఈ సంస్థ లెక్క ప్రకారం ఈ సేకరించిన రక్తంతో 7 గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్సలు, 12 సార్లు రక్త మార్పిడి చేయవచ్చట.
తాజా వార్తలు