నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా సాగుతున్న అన్ స్టాపబుల్ ఆహా షో రెండవ ఎపిసోడ్ కు సిద్దం అయ్యింది.మొదటి ఎపిసోడ్ లో మంచు మోహన్ బాబు హాజరు అయ్యాడు.
మంచు ఫ్యామిలీ కి చెందిన లక్ష్మి మరియు విష్ణు లు కూడా కొద్ది సమయం వచ్చి వెళ్లారు.ఆహా ఓటీటీ వారు రెండవ ఎపిసోడ్ కు గాను నాచురల్ స్టార్ నానిని బాలయ్య ముందు ఉంచారు.
బాలయ్య ఇప్పటికే మొదటి ఎపిసోడ్ తో సూపర్ అనిపించుకున్నాడు.ఇప్పుడు నానితో చేయబోతున్న ఎపిసోడ్ ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తప్పకుండా మొదటి ఎపిసోడ్ కు తగ్గట్లుగానే రెండవ ఎపిసోడ్ కూడా ఉంటుందని.నాని కి బాలయ్య అంటే ప్రత్యేక అభిమానం.
ఆ అభిమానంతో బాలయ్య తో నాని ఎలా మాట్లాడబోతున్నాడు అనేది ఆసక్తిగా మారింది.మరి కాసేపట్లో బాలయ్య మరియు నానిల అన్ స్టాపబుల్ కు సంబంధించిన ప్రోమో రాబోతుంది.
నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది.ఆ సినిమా భారీ అంచనాల నడుమ రూపొందింది.రాహుల్ సంకీర్త్యన్ దర్శకత్వంలో రూపొందింది.ఆ సినిమా ప్రమోషన్ ను చేసేందుకు నాని అన్ స్టాపబుల్ లో సందడి చేయబోతున్నారు అంటున్నారు.
మొదటి సారి బాలయ్య ను జై బాలయ్య అంటూ నినదించింది నాని అనే విషయం కొద్ది మందికే తెలుసు.చాలా మంది అభిమానులు ఈ జై బాలయ్యను మొదలు పెట్టారని అనుకుంటారు.
కాని నాని సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది.ఆ డైలాగ్ లో జై బాలయ్య ఉంటుంది.అలా బాలయ్య అభిమానులు జై బాలయ్య అంటూ నినదిస్తున్నారు.పెద్ద ఎత్తున బాలయ్య అభిమానులతో పాటు సోషల్ మీడియా వారు అంతా కూడా జై బాలయ్య ను ఒక నినాదంగా మార్చేసి అందరి దృష్టిని ఆకర్షించారు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అలాంటి నానితో బాలయ్య అన్ స్టాపబుల్ అంటే ఎపిసోడ్ పై ఖచ్చితంగా అంచనాలు భారీగా ఉంటాయి.ఈ శుక్రవారం ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.ప్రోమో మాత్రం నేడు సాయంత్రం 5 గంటలకు జనాల ముందుకు రాబోతుంది.