ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు జోరుగా కురుస్తున్న క్రమంలో వాగులు నదులు పొంగిపొర్లుతున్నాయి.మొన్న కురిసిన వర్షాలకు డ్యాములు ప్రాజెక్టులు పొంగి పొర్లుతున్నాయి.
అయితే తాజాగా మళ్లీ మూడు రోజుల పాటు ఏపీ లో వర్షాలు భారీగా కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.రానున్న 48 గంటలపాటు రాష్ట్ర వ్యాప్తంగాభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
మహారాష్ట్ర లోని విదర్భ తోపాటు పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతుందని దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేయడం జరిగింది.వచ్చే రెండు మూడు రోజుల్లో రాయలసీమలో సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కూడా స్పష్టం చేయడం జరిగింది.
ఇదే క్రమంలో కోస్తాంధ్రలో వచ్చే వారం రోజులపాటు సాధారణం కంటే అధికంగా వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టం చేయడం జరిగింది.