ఈ మధ్య కాలంలో స్టార్ యాంకర్లుగా గుర్తింపును సొంతం చేసుకున్న యాంకర్లు పెళ్లిపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు.శ్రీముఖి, ప్రదీప్, సుడిగాలి సుధీర్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారనే ప్రశ్నకు సమాధానం దొరకడంలేదు.
ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న సర్కార్ షోకు సంబంధించిన మూడో ఎపిసోడ్ ప్రోమో తాజాగా రిలీజైంది.ఈ షోకు ప్రవీణ్, మధు, యాంకర్ శ్రీముఖి హాజరయ్యారు.
శ్రీముఖి తగ్గేదేలే అని చెప్పగా ప్రదీప్ ఆమె లావుగా ఉందని తగ్గేదేలే అని ఇమిటేట్ చేస్తూ చెబుతాడు.
శ్రీముఖి అలీతో మీరే దగ్గరుండి నా పెళ్లి చేయాలి సార్ అని చెప్పగా షాకవ్వడం అలీ వంతవుతుంది.
ప్రదీప్ ఏడుస్తున్నట్టు యాక్ట్ చేస్తూ అవుతుందమ్మా.నీకు ఎప్పటికైనా పెళ్లి అవుతుందని చెబుతాడు.
శ్రీముఖి ప్రదీప్ తో నీకు కూడా ఏదో ఒకరోజు పెళ్లి అవుతుంది ప్రదీప్ అని చెబుతారు.ప్రదీప్ పెళ్లి గురించి మాట్లాడుతూ అయ్యయ్యో వద్దమ్మా అని చెబుతాడు.
వేలంపాటలో నలుగురు సెలబ్రిటీలు పాల్గొనగా అలీ మధు లేదా శ్రీముఖి గెలుస్తారని చెబుతాడు.
శ్రీముఖి హార్డ్ వేర్ అని మధు సాఫ్ట్ వేర్ అని అందువల్ల వాళ్లు గెలిచే అవకాశం ఉంటుందని తాను, ప్రవీణ్ టప్పర్ వేర్ కాబట్టి గెలిచే అవకాశం లేదని అలీ పేర్కొన్నారు.
నవంబర్ నెల 11వ తేదీన ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.ప్రవీణ్ షో నుంచి బయటకు వెళ్లినట్టు ప్రోమోలో చూపించగా అలా ఎందుకు చూపించారో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.ఈ షో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది.
ఆహా ఓటీటీ కొత్త తరహా ప్రోగ్రామ్స్ ను ప్లాన్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.ఈ ఓటీటీలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షోకు బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తుండగా బాలయ్య తనదైన శైలి ప్రశ్నలు అడుగుతూ ప్రేక్షకులను మెప్పిస్తూ ఉండటం గమనార్హం.