రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలకేంద్రానికి చెందిన మహమ్మద్ ఖలీం తండ్రి గుడుమియా (32)అనారోగ్యంతో బాధపడుతున్నాడు .సమాచారం తెలుసుకున్న పూర్వ విద్యార్థులు 2006-2007ఎస్ఎస్సి బ్యాచ్ నిత్యావసర సరుకులు రూ.10 వేల నగదు, వాకర్ స్టాండ్ ను గురువారం వారి ఇంటికి వెళ్లి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న మిత్రునికి తల ఇంత నగదు జమ చేసి మెడిసిన్ నిమిత్తం అందచేయడం జరిగిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మిత్రులు దుబ్బ పృథ్విదర్ రెడ్డి, చింతకింది శ్రీకాంత్, పందిర్ల శ్రీనివాస్, కిషన్ , స్థానికులు ఎడ్ల సందీప్, అజ్జు ,షాదుల్, దేశపండి మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు
Latest Rajanna Sircilla News