మహిళను డే కేర్ సెంటర్( Day care center ) కు తరలించిన 108 సిబ్బంది జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ లక్ష్మీరాజం( Welfare Officer Lakshmirajam ) ఆదేశాల మేరకు డే కేర్ సెంటర్ లో అమేకు వసతి ఏర్పాట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పాత బస్టాండ్ లోని ఆంధ్ర బ్యాంకు ఎటిఎం ప్రక్క సంది లో అనుమానాస్పదంగా మంగళవారం నుంచి గుర్తు తెలియని మహిళ పడి ఉన్నదని వాట్సాప్ గ్రూప్ ల్లో పోస్ట్ చేయగా రాజన్న సిరిసిల్ల జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ లక్ష్మీరాజం వెంటనే స్పందించి బుధవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని డే కేర్ సెంటర్ కోఆర్డినేటర్ మమతా ను ఆమెను డే కేర్ సెంటర్ కు తరలించి వసతి కల్పించాలని ఆదేశించారు,బస్టాండ్ ప్రాంతం నుంచి ఆ మహిళ ను 108 అంబులెన్స్ డ్రైవర్ నీలేష్( Driver Nilesh ) , టెక్నిషియన్ సతీష్ లు డే కేర్ సెంటర్ కు తరలించారు ,ఆ మహిళ వీర్నపల్లి మండలం మద్దిమల్ల గ్రామానికి చెందిన గిరిజన సామాజిక వర్గానికి చెందిన బానోత్ కమల గా గుర్తించామని ఆమెకు భర్త,ఇద్దరు పెళ్ళిలు అయిన ఇద్దరు పిల్లలు ఉన్నారని ఆమె చెబుతుందని కో ఆర్డినేటర్ మమతా తెలిపారు.
![](https://telugustop.com/wp-content/themes/novapress-pro/tstop/img/sharingcaring.png)
![Follow Us on Facebook Follow Us on Facebook](https://telugustop.com/img/social-icons/facebook.png)
![Follow Us on WhatsApp Follow Us on WhatsApp](https://telugustop.com/img/social-icons/whatsapp1.png)
![Follow Us on Twitter Follow Us on Twitter](https://telugustop.com/img/social-icons/twitter.png)
Latest Rajanna Sircilla News