దేవాలయాల దొంగతనం కేసులో ఇద్దరు నింధితులకు ఒక సంవత్సరం జైలు శిక్ష..

రాజన్న సిరిసిల్ల జిల్లా: దేవాలయాల్లో చోరీ చేసిన కేసులో ఇద్దరికి ఏడాది జైలు విధిస్తూ సిరిసిల్ల ప్రథమశ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ బుదవారం తీర్పు వెలువడిoచారు.ప్రాసిక్యూషన్ కథనం మేరకు.29 జూన్ 2023 రోజున రగుడు ఎల్లమ్మ దేవాలయం, సిరిసిల్ల విశ్వనాథ ఆలయంలో చోరీ జరిగిందని ఆలయాల అధికారులు సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి చోరీ చేసిన మైలారం ఆశారాములు, బాలె నర్సిoహులను అరెస్టు చేసి రిమాండ్ తరలించారు.

 One Year Imprisonment For Two Accused In Temple Theft Case, One Year Imprisonmen-TeluguStop.com

విచారణ అనంతరం విచారణ అధికారి బి.సిననాయక్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసారు.సిఎంఎస్ ఎస్ ఐ లావుడ్య శ్రీకాంత్ ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ వేముల నరేష్ ద్వారా నిందితుడు నేరంను కోర్టులో అంగీకరించటంతో కేసు పూర్వపరాలు పరిశీలించిన మేజిస్ట్రేట్ నిందితుడికి 1 సంవత్సరం జైలు శిక్ష విధించారని టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube