రాజన్న సిరిసిల్ల జిల్లా :పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడిన పేకాట రాయుళ్లు.ఎల్లారెడ్డిపేట ఎస్సై రమాకాంత్ తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని శివారు అయినా కేశవ పెరమాండ్లు ఆలయం గుట్ట ప్రాంతంలో పలువురు పేకాట ఆడుతున్నారని సమాచారం తెలుసుకున్న ఎల్లారెడ్డిపేట ఎస్సై రమాకాంత్ తన సిబ్బందితో కలిసి కేశవ పెరుమాండ్ల గుట్ట వద్దకు వెళ్లగా ఏడుగురు వ్యక్తులు పేకాట ఆడుతుండడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.సంఘటన స్థలంలో రూ.20080 రూపాయల నగదు, నాలుగు ద్విచక్ర వాహనాలు, ఏడు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్కు తరలించినట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎస్సై రమాకాంత్ మాట్లాడుతూ మండలంలో ఎవరైనా జూదం ఆడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని కేసులు నమోదు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.అదే విధంగా ఎవరైనా జూదం ఆడినట్లయితే తమకు సమాచారం అందించాలని అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.
Latest Rajanna Sircilla News