ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.ఈ మేరకు జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
కాగా వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ మేరకు ఈ పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం ఎల్లుండి విచారణ చేయనుంది.
అయితే అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ బెయిల్ పై ఉన్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఇప్పటికే కేసుపై సీబీఐ దర్యాప్తు ఆలస్యం అవుతుందంటూ ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే సీబీఐ, జగన్ తో పాటు ప్రతివాదులు అందరికీ నోటీసులు పంపింది.