జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై శుక్రవారం సుప్రీంలో విచారణ

ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.ఈ మేరకు జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

 Hearing On Jagan's Bail Cancellation Petition In The Supreme Court On Friday-TeluguStop.com

కాగా వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ మేరకు ఈ పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం ఎల్లుండి విచారణ చేయనుంది.

అయితే అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ బెయిల్ పై ఉన్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఇప్పటికే కేసుపై సీబీఐ దర్యాప్తు ఆలస్యం అవుతుందంటూ ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే సీబీఐ, జగన్ తో పాటు ప్రతివాదులు అందరికీ నోటీసులు పంపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube