ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) కీలక వ్యాఖ్యలు చేశారు.ఎల్లుండి తాను తీహార్ జైలు( Tihar Prison )కు వెళ్తున్నట్లు తెలిపారు.
ఈ సారి తనను ఎన్ని రోజులు జైలులో ఉంచుతారో తెలియదని కేజ్రీవాల్ పేర్కొన్నారు.తనను మాట్లాడనివ్వకుండా భయపెట్టడానికి అనేక విధాలుగా ప్రయత్నించారని ఆరోపించారు.
జైలులో ఉన్నప్పుడు తనకు మందులు ఇవ్వలేదన్న కేజ్రీవాల్ వీళ్లు ఏం కోరుకుంటున్నారో తనకు అర్థం కావడం లేదని తెలిపారు.ఈ క్రమంలోనే ఢిల్లీ ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
కష్ట సమయంలో తనకు ప్రజలు మద్ధతుగా నిలిచారన్న ఆయన నిరంకుశత్వానికి వ్యతిరేకంగా అందరం కలిసి పోరాడాలని వెల్లడించారు.