కోరమాండల్ ఎక్స్ప్రెస్ ట్రైన్( Coromandel Express )లో ఒక్కసారిగా పొగలు చెలరేగాయి.దీంతో రైలులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఏలూరు నుంచి విజయవాడ( Vijayawada ) వైపు వెళ్తుండగా కోరమాండల్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.వెంటనే గమనించిన అధికారులు రైలును అరగంట పాటు నిలిపివేశారు.
సాంకేతిక సిబ్బంది వచ్చి ట్రైన్ ను పరిశీలించిన తరువాత రైలును విజయవాడకు పంపించారు.అయితే ఎండ వేడిమి కారణంగా కోరమాండల్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో పొగలు వచ్చాయని ప్రాథమికంగా నిర్ధారించారు.