కోరమాండల్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో పొగలు.. భయాందోళనలో ప్రయాణికులు
TeluguStop.com
కోరమాండల్ ఎక్స్ప్రెస్ ట్రైన్( Coromandel Express )లో ఒక్కసారిగా పొగలు చెలరేగాయి.దీంతో రైలులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఏలూరు నుంచి విజయవాడ( Vijayawada ) వైపు వెళ్తుండగా కోరమాండల్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
వెంటనే గమనించిన అధికారులు రైలును అరగంట పాటు నిలిపివేశారు.సాంకేతిక సిబ్బంది వచ్చి ట్రైన్ ను పరిశీలించిన తరువాత రైలును విజయవాడకు పంపించారు.
అయితే ఎండ వేడిమి కారణంగా కోరమాండల్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో పొగలు వచ్చాయని ప్రాథమికంగా నిర్ధారించారు.
పాపం పురంధరేశ్వరి .. అందుకే పదవి దక్కలేదా ?