నైరుతి రుతుపవనాలు( Southwest Monsoon ) చురుగ్గా విస్తరిస్తున్నాయి.రెండు, మూడు రోజుల్లో మరింత విస్తరించేందుకు అనుకూల అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ క్రమంలోనే ఈశాన్య రాష్ట్రాల్లోనే మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.అదేవిధంగా ఏపీలో( AP ) మరో రెండు రోజులపాటు పొడి వాతావరణం ఉండనుందని తెలుస్తోంది.
దక్షిణ కోస్తాలో వడగాలులు వీచే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.ఈ క్రమంలోనే జూన్ 2వ తేదీ నుంచి ఏపీలో వర్షాలు( Rains ) కురిసే అవకాశం ఉంది.