చిత్తూరు జిల్లాలోని కుప్పంలో ఏనుగులు ( elephants_ )బీభత్సం సృష్టించాయి.గజరాజులు సృష్టించిన విధ్వంసంలో వరి, టమాట, మామిడి పంటలు ధ్వంసం అయ్యాయి.
కుప్పం మండలంలోని వెండుగంపల్లి, నడుమూరు, వసనాడు మరియు ఉర్ల ఓబనపల్లి పరిసరాల్లో రెండు ఏనుగులు సంచరిస్తున్నాయి.గత రెండు రోజులుగా మండలంలోని పలు ప్రాంతాల్లో గజరాజులు సంచరిస్తున్నాయి.
ఈ క్రమంలో ఏనుగులను అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు ఫారెస్ట్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.ప్రస్తుతం ఉర్ల ఓబనపల్లి సమీపంలోని మామిడితోటలో రెండు ఏనుగులు తిష్ట వేశాయి.
దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.