2025 సంవత్సరంలో తండేల్ మూవీ( Thandel ) బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.నాగచైతన్య,( Naga Chaitanya ) సాయిపల్లవి( Sai Pallavi ) జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 50 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధించింది.
అయితే తమిళనాడు రాష్ట్రంలో( Tamil Nadu ) తండేల్ సీన్ రిపీట్ కావడం కాగా ఆ సీన్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.తమిళనాడుకు చెందిన కొందరు మత్స్యకారులు పొరపాటున సరిహద్దు రేఖను దాటారు.
శ్రీలంక నావికా దళం( Srilanka Navy ) 27 మంది మత్య్సకారులను అరెస్ట్ చేసింది.ఈ విషయం వెలుగులోకి రావడంతో రామేశ్వరం ప్రాంతంలో ఉన్న 700 మంది జాలర్లు నిరవధిక సమ్మెకు దిగారు.
ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో తమిళనాడు సర్కార్ కేంద్రం సహకారం తీసుకొని మత్స్యకారులను విడిపించింది.తండేల్ సినిమా సీన్ రిపీట్ కావడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

తండేల్ సినిమా ఇతర భాషల్లో సైతం చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంది.గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేని నాగచైతన్యకు ఈ సినిమాతో ఒకింత భారీ సక్సెస్ దక్కిందనే చెప్పాలి.గీతా ఆర్ట్స్ బ్యానర్ కు నాగచైతన్య నటించడం వల్ల భారీ విజయాలు దక్కాయనే చెప్పాలి.100% లవ్, తండేల్ సినిమాల విజయాలు చైతన్య కెరీర్ కు ఎంతగానో ప్లస్ అయ్యాయని చెప్పవచ్చు.

తండేల్ సినిమా త్వరలో నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.తండేల్ మూవీ నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కడం ఈ సినిమాకు ప్లస్ అయింది.చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించారనే సంగతి తెలిసిందే.నాగచైతన్య తర్వాత సినిమా విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు డైరెక్షన్ లో తెరకెక్కనుంది.ఈ సినిమాపై ఒకింత భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయని చెప్పాలి.







