ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడు ఆలీ రాజమండ్రిలో పర్యటించారు.ఓ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ఆలీ మీడియాతో మాట్లాడటం జరిగింది.
ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో పోటీ అంశంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.గతంలో మాదిరిగానే పార్టీ అధినేత ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి… పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో రాజమండ్రి నుంచి పోటీ చేయబోతున్నట్లు వస్తున్న వార్తలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా… అవన్నీ ఊహాగానాలు అని కొట్టిపారేశారు.ఇదిలా ఉంటే రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ లో అనేక సినిమాలో షూటింగ్స్ జరిగాయి.
తన రెండో సినిమా షూటింగ్ కూడా ఈ కాలేజ్ లోనే జరిగింది.అటువంటి ఈ కాలేజీలో టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావటం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.
ఈ టోర్నీలో పాల్గొంటున్న ఆటగాళ్లు మెరుగ్గా ఆడి ఐపిఎల్ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.