తూర్పు గోదావరి జిల్లా అనంతపల్లిలో విషాదం

తూర్పుగోదావరి జిల్లాలో పండుగ వేళ విషాద ఘటన చోటు చేసుకుంది.నల్లజర్ల మండలం అనంతపల్లిలో కోడి కత్తి తగిలి ఓ వ్యక్తి మృతిచెందాడు.

 Tragedy In Anantapalli, East Godavari District-TeluguStop.com

పందాలు నిర్వహిస్తున్న బరుల వద్ద వీక్షిస్తున్న వ్యక్తిపై కోడి ఒక్కసారిగా ఎగిరి వచ్చింది.ఈ క్రమంలో కోడి కత్తి తగిలి వ్యక్తి కాలికి గాయమైంది.

తీవ్రంగా రక్తస్రావం కావడంతో బాధితుడిని హుటాహుటిన తాడేపల్లిగూడెం ఆస్పత్రికి తరలించారు.కాగా అప్పటికే సదరు వ్యక్తి మృతిచెందాడని వైద్యులు తెలిపారు.

మృతుడు అనంతపల్లికి చెందిన పద్మారావుగా గుర్తించారు.విషయం తెలుసుకున్న పందెం నిర్వాహకులు బరుల వద్ద నుంచి పరార్ అయ్యారు.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube