యాదాద్రి భువనగిరి జిల్లా:చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిసిసి అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది.ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నాయకులు రామిరెడ్డి దామోదర్ రెడ్డి, చెరుకు సుధాకర్,పాల్వాయి స్రవంతి రెడ్డి,పున్న కైలాసనేత,పల్లె రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆజాదిక గౌరవ్ యాత్ర నిర్వహించడం జరుగుతుందని.ఈనెల 13వ తేదీన నారాయణపురం నుండి చౌటుప్పల్ వరకు నిర్వహించే ఈ యాత్రలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు.
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.